Tollywood: సినీ గేయరచయిత చంద్రబోస్‌ తల్లి గుండెపోటుతో మృతి

  • ఈ ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్నుమూత
  • సాయంత్రం చిట్యాల మండలం చల్లగిరి గ్రామంలో అంత్యక్రియలు
  • విషాదంలో కుటుంబం

ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్‌ మాతృమూర్తి ఈ ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహంలో గుండె పోటుతో చనిపోయారు. ఈ హఠాత్పరిణామంతో బోస్‌ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. ఈ సాయంత్రం చిట్యాల మండలంలోని చల్లగిరి గ్రామంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. 1995లో తాజ్‌మహల్‌ సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించిన చంద్రబోస్‌ అమ్మపై ఎన్నో పాటలు రాశారు.  

More Telugu News