Andhra Pradesh: చంద్రబాబును ప్రస్తుతం ఢిల్లీలో ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారు!: విజయసాయిరెడ్డి సెటైర్లు

  • పిలవని పేరంటంలా బాబు అందరి ఇళ్లపై పడుతున్నారు
  • వాళ్లను కలుపుతా-వీళ్లను ఏకం చేస్తా అంటున్నారు
  • అందుకే చంద్రబాబుకు ఈ మారుపేరు పెట్టారు

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబును ఢిల్లీలో అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫొటోలు దిగుతూ, వాళ్లను కలుపుతా-వీళ్లను కలుపుతా అని చంద్రబాబు అంటున్నారని దుయ్యబట్టారు. ఇది చూసిన నేతలు చంద్రబాబుకు ఈ మారుపేరు పెట్టారనీ, జోకులు వేసుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘‘ఢిల్లీలో చంద్రబాబును అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫోటోలు దిగుతూ, వాళ్లను కలుపుతా వీళ్లను ఏకం చేస్తా అంటుంటే ఈ నిక్ నేమ్ తగిలించారట. ఎవరి టెన్షన్లలో వాళ్లుంటే సమయం, సందర్భం లేకుండా ఈ ఫెవికాల్ రాయబారాలు ఏమిటని జోకులేసుకుంటున్నారట’’ అని ట్వీట్ చేశారు.

More Telugu News