Chittoor District: చంద్రగిరిలో దళితులు నిర్భయంగా ఓటేశారు: కలెక్టర్ ప్రద్యుమ్న

  • చంద్రగిరిలో రీపోలింగ్ ప్రశాంతం
  • ఏడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్
  • 89.29 శాతం ఓటింగ్ నమోదు

చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని 7 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. రీపోలింగ్ సందర్భంగా దళితులు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు. మొత్తం ఏడు పోలింగ్ కేంద్రాల్లో 89.29 శాతం పోలింగ్ నమోదైనట్టు చెప్పారు. అయితే గత నెల 11న జరిగిన పోలింగ్ లో 90.42 శాతం ఓటింగ్ నమోదైందని ప్రద్యుమ్న వివరించారు.

More Telugu News