NDA: ఎగ్జిట్ పోల్స్: ఎన్డీయేకి 287 స్థానాలు... యూపీఏ 128!

  • రిపబ్లిక్ సీ ఓటర్స్ సర్వేలో ఎన్డీయే వైపు మొగ్గు
  • న్యూస్ ఎక్స్ సర్వేలో సైతం ఇవే ఫలితాలు
  • దాదాపు అన్ని పోల్స్ లో ఎన్డీయేకి ఆధిక్యం

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ హడావుడి మొదలైంది. తాజాగా, రిపబ్లిక్ సీ ఓటర్స్ ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి 287 స్థానాలు, కాంగ్రెస్ ప్రాబల్యం ఉన్న యూపీయే కూటమికి 128 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. ఇక న్యూస్ ఎక్స్ జాతీయ మీడియా చానల్ తన ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీయేకి 298 స్థానాలు, యూపీఏకి 118, ఇతరులు 126 స్థానాల్లో గెలవబోతున్నట్టు పేర్కొంది. దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయే వైపే మొగ్గుచూపుతున్నట్టు ట్రెండ్స్ చూస్తే అర్థమవుతుంది.

More Telugu News