Prakasam District: ప్రకాశం జిల్లాలో చెత్తకుప్పలో దర్శనమిచ్చిన వీవీప్యాట్ స్లిప్పులు

  • దర్శి పట్టణంలో ఘటన
  • అధికారులకు ఫిర్యాదు చేసిన స్థానికులు
  • అవి మ్యాక్ పోలింగ్ స్లిప్పులన్న అధికారులు

దేశవ్యాప్తంగా ఈవీఎంలు, వీవీప్యాట్ల అంశం రగులుతున్న ప్రస్తుత తరుణంలో ప్రకాశం జిల్లాలోని దర్శి పట్టణంలో వీవీప్యాట్ స్లిప్పులు కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దర్శిలోని ఓ చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు దర్శనమివ్వడంతో స్థానికులు నివ్వెరపోయారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో చెత్తకుప్పలో వీవీప్యాట్ స్లిప్పులు ప్రత్యక్షమైన తీరుపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, అవి ఓటింగ్ కు ముందు నిర్వహించే మ్యాక్ పోలింగ్ కు సంబంధించిన స్లిప్పులని, వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరంలేదని అధికారులు తేలిగ్గా తీసుకున్నారు.

More Telugu News