Congress: ఫలితాల ముందు కేసీఆర్ గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారు: మల్లు రవి

  • టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని భావిస్తున్నాం
  • కాంగ్రెస్ కు 220 సీట్లు వస్తాయి
  • కాంగ్రెస్ ఇతర పార్టీల సహకారం తీసుకుంటుంది

కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే సీట్లపై ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 220 సీట్లు రావడం తథ్యమని, ఇతర పార్టీలు కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కూడా మద్దతు ఇస్తుందని భావిస్తున్నామని, అయితే ఫలితాల ముంగిట కేసీఆర్ వైఖరి చూస్తే గోడమీద పిల్లి వాటంలా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణలో అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ కే అత్యధిక స్థానాలు వస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో కాంగ్రెస్ అన్ని పార్టీల సహకారం తీసుకుంటుందని మల్లు రవి స్పష్టం చేశారు.

More Telugu News