godsey: గాడ్సేకు కూడా ఫ్యాన్ క్లబ్ ఉందని నాకు తెలియదు.. బీజేపీ నేతలకు చురకలు అంటించిన గుత్తా జ్వాల!

  • గాడ్సేపై బీజేపీ నేతల ప్రశంసల వర్షం
  • తీవ్రంగా స్పందించిన బాడ్మింటన్ స్టార్
  • గాడ్సేను సమర్థించడంపై ఆశ్చర్యం

బీజేపీ నేతలు సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి హెగ్డే, కర్ణాటక నేత నలిన్ కుమార్ లు మహాత్మా గాంధీ హంతకుడు గాడ్సేను ఓ రేంజ్ లో ప్రశంసించిన సంగతి తెలిసిందే. అయితే అన్నివైపుల నుంచి విమర్శలు రావడం, బీజేపీ అధిష్ఠానం కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో వీరు వెనక్కు తగ్గి క్షమాపణలు కోరారు.

 తాజాగా ఈ వ్యవహారంపై బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా స్పందించారు. గాంధీజీ హంతకుడైన గాడ్సేకు కూడా ఓ ఫ్యాన్ క్లబ్ ఉందని తనకు తెలియదని ఆమె వ్యాఖ్యానించారు. బాపూను చంపడాన్ని ఇంకా కొందరు సమర్థించుకుంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిబట్టి భవిష్యత్ లో మన పిల్లలు మన దేశ చరిత్రనే నమ్మబోరని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు చూస్తే తనకు నిజంగానే భయం కలుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు గుత్తా జ్వాల ట్వీట్ చేశారు.

More Telugu News