Odisha: ‘దంతెవాడ’ దాడులకు ప్రతీకారం.. పంచాయతీ ఆఫీసును పేల్చివేసిన మావోయిస్టులు!

  • ఒడిశాలోని మల్కన్ గిరిలో ఘటన
  • తిమురుపల్లి పంచాయతీ ఆఫీసు పేల్చివేత
  • కూంబింగ్ ముమ్మరం చేసిన భద్రతాబలగాలు

ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలో ఈరోజు మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని తిమురుపల్లి పంచాయతీ కార్యాలయాన్ని బాంబులతో పేల్చివేశారు. ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడలో కేంద్ర సాయుధ బలగాల దమనకాండకు నిరసనగానే ఈ భవనాన్ని పేల్చివేసినట్లు మావోయిస్టులు ప్రకటించారు.

ఈ మేరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు) పేరుతో కరపత్రాలను అంటించారు. పంచాయతీ కార్యాలయాన్ని పేల్చివేసిన అనంతరం మావోయిస్టులు అటవీప్రాంతంలోకి పారిపోయారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు, కేంద్ర బలగాలతో కలిసి కూంబింగ్ ను ముమ్మరం చేశారు.

More Telugu News