balakrishna: బాలకృష్ణ సరసన పాయల్ రాజ్ పుత్?

  • త్వరలో సెట్స్ పైకి 'రూలర్'
  • ప్రతినాయకుడిగా జగపతిబాబు
  •  ఒక కథానాయికగా హరిప్రియ   

బాలకృష్ణ - కెఎస్ రవికుమార్ కాంబినేషన్లో గతంలో 'జై సింహా' వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుంది. సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలో కవల సోదరులుగా బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఒక కథానాయికగా కన్నడ బ్యూటీ 'హరిప్రియ' పేరు వినిపిస్తోంది. రెండవ కథానాయికగా పాయల్ రాజ్ పుత్ పేరు తెరపైకి వచ్చింది.

'ఆర్ ఎక్స్ 100' సినిమాతో పరిచయమైన ఈ సుందరి, గ్లామర్ పరంగా ఫుల్ మార్కులు కొట్టేసింది. 'వెంకీమామ' .. 'డిస్కో రాజా' సినిమాల్లో ఛాన్సులు పట్టేసింది. తాజాగా బాలకృష్ణ సినిమాలోను అవకాశాన్ని దక్కించుకుందని అంటున్నారు. ఈ సినిమాకి 'రూలర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ప్రతినాయక పాత్ర కోసం జగపతిబాబును తీసుకున్న విషయం తెలిసిందే.

More Telugu News