modi: ప్రజలు మోదీకి బదులు అమితాబ్ ను ప్రధానిగా ఎన్నుకోవాల్సింది: ప్రియాంకగాంధీ సెటైర్లు

  • మీర్జాపూర్, సలెంపూర్ లలో ప్రియాంక ప్రచారం
  • ప్రపంచంలోనే అత్యుత్తమ నటుడు మోదీ
  • పబ్లిసిటీ, అబద్ధాలతోనే మోదీ లబ్ది పొందాలని చూస్తున్నారు

ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ సెటైర్లు వేశారు. యూపీలోని మీర్జాపూర్, సలెంపూర్ ల లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యుత్తమ నటుడు మోదీ అని, ప్రజలు ఆయనకు బదులు అమితాబ్ బచ్చన్ ను ప్రధానిగా ఎన్నుకుని ఉండాల్సిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎందుకంటే, మోదీ గానీ, అమితాబ్ బచ్చన్ గానీ ప్రజలకు సేవ చేసిన దాఖలాలు లేవని అన్నారు. అభివృద్ధి అజెండా కంటే, పబ్లిసిటీ, అబద్ధాలతోనే మోదీ లబ్ది పొందాలని చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారణాసి ప్రజలకు మోదీ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. నాయకుడు అనేవాడు ప్రజలకు నిజాలు చెప్పాలని, మోదీ మాత్రం అవాస్తవాలు చెబుతూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

ఇదిలా ఉండగా, మోదీని విమర్శించే క్రమంలో అమితాబ్ బచ్చన్ పేరును ప్రస్తావించిన ప్రియాంక గాంధీ ‘సెల్ఫ్ గోల్’ కొట్టుకున్నట్టయిందని విమర్శకులు భావిస్తున్నారు.1984లో యూపీ నుంచి కాంగ్రెస్ ఎంపీగా అమితాబ్ ఎన్నికయ్యారు.  

More Telugu News