junior NTR: ఆ విషాదం నుంచి ఇంకా తేరుకోలేదు... జన్మదిన వేడుకలు వద్దు: అభిమానులకు జూనియర్‌ ఎన్టీఆర్‌ సూచన

  • గత ఏడాది ఆగస్టులో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి
  • ఈనెల 20న జూ.ఎన్టీఆర్‌ పుట్టిన రోజు
  • ఏర్పాట్లు చేస్తున్న అభిమానులను వారించిన జూనియర్‌

తన పుట్టిన రోజు వేడుకలకు ఎటువంటి హడావుడి చేయవద్దని అభిమానులకు జూనియర్‌ ఎన్టీఆర్‌ సూచించారు. ‘నాన్న మమ్మల్ని విడిచి వెళ్లి ఏడాది కూడా పూర్తికాలేదు. ఇంకా ఆ విషాదం నుంచి మేము తేరుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఎటువంటి వేడుకలు వద్దు’ అంటూ జూనియర్‌ అభిమానులను కోరారు. ఈనెల 20వ తేదీన జూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు.

 గత ఏడాది ఆగస్టు 29వ తేదీన హరికృష్ణ హైదరాబాద్‌ నుంచి నెల్లూరుకు కారును స్వయంగా డ్రైవ్‌ చేసుకుని వెళ్తున్న సమయంలో నల్గొండ సమీపంలోని నార్కేట్‌పల్లి వద్ద కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో హరికృష్ణ అక్కడికక్కడే చనిపోయారు.  తండ్రి చనిపోయి ఇంకా ఏడాది కూడా పూర్తికాకపోవడంతో ఈ ఏడాది పుట్టిన రోజు వేడుకలు జరుపుకోకూడదని జూనియర్‌ ఎన్టీఆర్‌ నిర్ణయించారు. అదే సమాచారాన్ని అభిమానులకు తెలిపారు. ప్రస్తుతం తారక్‌ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

More Telugu News