azam khan: గాంధీనా లేక గాడ్సేనా.. ప్రజలే నిర్ణయిస్తారు: ఆజం ఖాన్

  • ఖాకీ నిక్కరుతోనే గాడ్సేకు గుర్తింపు వచ్చింది
  • సాధ్వి వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్న ఆజం ఖాన్
  • గాడ్సే గొప్ప దేశభక్తుడు అన్న సాధ్వి వ్యాఖ్యలపై ఆజం ఖాన్ స్పందన

మహాత్మాగాంధీని చంపిన గాడ్సే గొప్ప దేశ భక్తుడంటూ బీజేపీ నాయకురాలు సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు చివరకు బీజేపీని కూడా ఇరుకున పెట్టాయి. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు సాధ్వి క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదం ఇంకా చల్లారలేరు. సమాజ్ వాదీ పార్టీ వివాదాస్పద నేత ఆజం ఖాన్ ఈ అంశంపై విమర్శలు గుప్పించారు. ఆరెస్సెస్ ఖాకీ నిక్కరుతోనే గాడ్సేకు గుర్తింపు లభించిందని చెప్పారు. గాంధీ కావాలో, గాడ్సే కావాలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. గాడ్సే గురించి సాధ్వి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.

More Telugu News