Chiranjeevi: ప్రత్యేక సెట్లో చిరంజీవి, తమన్నాలపై పాట

  • చిరు ప్రధాన పాత్రలో ‘సైరా’
  • యువరాణి పాత్రలో తమన్నా
  • రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తుండగా, తమన్నా యువరాణి పాత్రలో కనిపించనుంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ  ఫిలిం సిటీలో జరుగుతోంది. అనంతరం వారం రోజుల పాటు వికారాబాద్ అడవుల్లో మరో షెడ్యూల్ జరగనుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన అనంతరం అన్నపూర్ణ ఏడు ఎకరాల్లో నిర్మించిన ప్రత్యేక సెట్‌లో తమన్నాతో కలిసి చిరు ఓ పాటకు స్టెప్పులేయనున్నారని సమాచారం. ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. అనంతరం నిర్మాణానంతర పనులు జరిపి, ఆగస్ట్ 15న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

More Telugu News