Hyderabad: హైదరాబాద్ లో నకిలీ ఐపీఎస్ అరెస్టు

  • గురువినోద్ ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు
  • ఎన్ఐఏ అదనపు ఎస్పీనని చెప్పుకుని తిరుగుతున్నాడు
  • గతంలోనూ నకిలీ గుర్తింపు కార్డులతో కొందరిని బెదిరించాడు

పలువురిని మోసం చేస్తున్న ఓ నకిలీ ఐపీఎస్ అధికారిని హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఎన్ఐఏ అదనపు ఎస్పీనని చెప్పుకుని తిరుగుతున్న గురువినోద్ కుమార్ రెడ్డి ని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈరోజు అరెస్టు చేసినట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్మీ మేజర్ ఇంట్లో గురువినోద్ కొన్ని వస్తువులు చోరీ చేశాడని, నిందితుడి నుంచి తుపాకి, ల్యాప్ టాప్, స్టాంపులు, సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గురువినోద్ ను ప్రకాశం జిల్లా గిద్దలూరు వాసిగా గుర్తించినట్టు చెప్పారు. గతంలోనూ నకిలీ గుర్తింపు కార్డులతో కొందరిని బెదిరించి జైలు కెళ్లాడని, జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ బెదిరింపులు, మోసాలకు పాల్పడినట్టు తెలిపారు. 

More Telugu News