Gandhi: గాడ్సే గొప్ప దేశభక్తుడన్న సాధ్వి క్షమాపణలు చెప్పాలి: జీవీఎల్

  • ఆమె వ్యాఖ్యలతో బీజేపీ ఏకీభవించదు 
  • ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
  • ఈ విషయమై పార్టీ వివరణ కోరుతుంది 

గాంధీని చంపిన నాథూరాం గాడ్సే గొప్ప దేశభక్తుడంటూ బీజేపీ నాయకురాలు సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను సొంత పార్టీ నేత, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఖండించారు. ఆమె చేసిన వ్యాఖ్యలతో బీజేపీ ఏకీభవించదని, ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ఈ వ్యాఖ్యల విషయమై పార్టీ వివరణ కోరుతుందని, ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలని జీవీఎల్ కోరారు.

More Telugu News