Mahesh Babu: ‘నువ్వని ఇది నీదని..’ నా హృదయానికి చేరువైన పాట ఇది: మహేశ్ బాబు

  • మహేశ్, పూజ జంటగా ‘మహర్షి’
  • కీలక పాత్రలో అల్లరి నరేష్
  • ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన ‘మహర్షి’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించాడు. మే 9న విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఇదిలా ఉంచితే, ఈ చిత్రం ఆడియో‌ను రిలీజ్ చేసినప్పుడు ఒక పాటను చిత్రబృందం విడుదల చెయ్యలేదు. నేడు ఆ పాటను యూ ట్యూబ్ లో విడుదల చేశారు. ‘నువ్వని ఇది నీదని..’ అని సాగే ఆ పాట తన హృదయానికి బాగా చేరువైందని మహేశ్ ట్వీట్ చేశాడు. కార్తీక్ ఆలపించిన ఈ గేయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

More Telugu News