Andhra Pradesh: గోవా బీచ్ లో జగ్గయ్యపేట యువ వైద్యురాలు ఊటుకూరు రమ్యకృష్ణ మృతి

  • సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదం
  • అలల్లో కొట్టుకుపోయిన వైనం
  • గతేడాది గోవాలో ఉద్యోగంలో చేరిన ఊటుకూరు రమ్యకృష్ణ

గోవా బీచ్ లో ఓ తెలుగమ్మాయి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఊటుకూరు రమ్యకృష్ణ వృత్తిరీత్యా ఓ వైద్యురాలు. 2008 వరకు జగ్గయ్యపేట హెల్త్ సెంటర్ లో డాక్టర్ గా పనిచేసిన రమ్యకృష్ణ ఆ తర్వాత గోవాలో ప్రభుత్వ అనుబంధ వైద్యసంస్థలో ఉద్యోగంలో చేరారు.

అయితే, మంగళవారం సాయంత్రం గోవా బీచ్ లో సెల్ఫీ తీసుకునే క్రమంలో ఊటుకూరు రమ్యకృష్ణ అలల్లో కొట్టుకునిపోయి ప్రాణాలు విడిచారు. రమ్యకృష్ణ స్వస్థలం జగ్గయ్యపేటలోని మార్కండేయ బజారు. ఆమెకు తల్లి, సోదరులు, ఓ సోదరి ఉన్నారు.

More Telugu News