Dost: తెలంగాణలో డిగ్రీలో ప్రవేశాలకు.. ఈ నెల 22న 'దోస్త్' నోటిఫికేషన్

  • నేడు విడుదల కావాల్సిన నోటిఫికేషన్ వాయిదా
  • 27న ఇంటర్ రీ వెరిఫికేషన్ ఫలితాలు విడుదల
  • 23 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు

తెలంగాణలో నేడు విడుదల కావాల్సిన డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల ప్రకటన వాయిదా పడింది. ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థుల రీ వెరిఫికేషన్ ఫలితాలు ఈ నెల 27న విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నేడు విడుదల చేయాల్సిన దోస్త్ నోటిఫికేషన్‌ను కమిటీ నిలిపివేసింది. నేడు సమావేశమైన దోస్త్ కమిటీ ఈ నెల 22న నోటిఫికేషన్‌ను జారీ చేయాలని నిర్ణయించింది. 23 నుంచి విద్యార్థులు దోస్త్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపింది.

More Telugu News