West Bengal: బీజేపీ తీరుకి నిరసనగా కోల్ కతాలో మమతా బెనర్జీ ర్యాలీ

  • నిన్నటి  ఘటనకు బీజేపీనే కారణమంటున్న మమత
  • బెలియగుట్ట నుంచి శ్యామ్ బజార్ వరకు ర్యాలీ
  • అధిక సంఖ్యలో పాల్గొన్న తృణమూల్ మద్దతుదారులు

నిన్న పశ్చిమ బెంగాల్ లో అమిత్ షా చేపట్టిన రోడ్ షో లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారణం బీజేపీ శ్రేణులేనని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బీజేపీ శ్రేణుల విధ్యంసాన్ని నిరసిస్తూ నేడు ర్యాలీ నిర్వహిస్తున్నారు. కోల్ కతాలోని బెలియగుట్ట నుంచి శ్యామ్ బజార్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీలో ‘తృణమూల్’ నేతలు, నాయకులు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More Telugu News