Andhra Pradesh: ఏపీలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు: ఆర్జీజీఎస్

  • ఈ నెల 19 నుంచి 23 వరకు ఉష్ణోగ్రతలు పెరిగే సూచన 
  • కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలపై పడనున్న ప్రభావం
  • 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం

ఏపీలో ఇప్పటికే ఎండలు మండుతున్నాయి. ఈ వారంలో మరింత ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నట్లు ఆర్టీజీఎస్ పేర్కొంది. ఈ నెల 19 నుంచి 23 వరకు ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు ఉన్నాయని, కృష్ణా, గుంటూరు, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగొచ్చని,   అత్యధికంగా 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఆర్టీజీఎస్ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

More Telugu News