babu mohan: కోట నన్ను ఏడిపిస్తున్నాడని తెలిసి ఆయనకి వాణిశ్రీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది: బాబూ మోహన్

  • నాపై కోటకు కోపంగా ఉండేది 
  • నా పట్ల ఆయన తీరుకి వాణిశ్రీకి కోపం వచ్చింది 
  • ఆ తరువాత నేను .. కోట స్నేహితులమయ్యాము

తాజా ఇంటర్వ్యూలో బాబూ మోహన్ మాట్లాడుతూ, 'బొబ్బిలిరాజా' షూటింగు సమయంలో జరిగిన ఒక సంఘటనను గురించి చెప్పుకొచ్చారు. "నేను .. కోట శ్రీనివాసరావు కలిసి మొదటిసారిగా 'బొబ్బిలిరాజా' సినిమాలో చేశాము. అప్పటికే కోట గారు నాపై చాలా కోపంగా వున్నాడని తెలిసింది నాకు. 'ఎవడో కామెడీ విలన్ నాకు పోటీగా వచ్చాడంటా .. ఎవడు వాడు .. ఏంటి?' అంటూ కోట అంటున్నట్టుగా నాకు కొంతమంది  చెప్పారు.

'బొబ్బిలి రాజా' చేస్తుండగా నన్ను కోట ఆ మాట .. ఈ మాట అంటూ వుండటం వాణిశ్రీగారు గమనించారు. ఆమె కోటను పిలిచి "ఏంటయ్యా సీనియర్ ఆర్టిస్టునని పోజు కొడుతున్నావ్ .. ఎందుకు బాబూ మోహన్ ని ఏదో ఒకటి అంటూనే వున్నావ్ .. నేను వింటూనే వున్నాను. మరి నేను కూడా నీకన్నా సీనియర్ ఆర్టిస్టునే .. ఏమనుకుంటున్నావ్ నువ్వు?" అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. అంతేకాదు .. ఆ షూటింగ్ కాగానే కోట మరో షూటింగుకి వెళ్లాలి. ఆయనపై కోపంతో వాణిశ్రీ ఈ షూటింగు ఆపేసింది. ఆ తరువాత కాలంలో నేను .. కోట మంచి స్నేహితులమయ్యాము" అని చెప్పుకొచ్చారు.

More Telugu News