ys viveka: వైయస్ వివేకా హత్య కేసుపై ఇప్పుడు ఏమీ చెప్పలేం: ఏపీ డీజీపీ

  • వివేకా కేసు విచారణ అన్ని కోణాల్లో జరుగుతోంది
  • విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులను అరెస్ట్ చేశాం
  • డ్రంకెన్ డ్రైవ్, అతి వేగం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి

వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ చెప్పారు. అయితే, కేసుకు సంబంధించిన వివరాలను ఇప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు. విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులను అరెస్ట్ చేశామని... ఓ కార్యక్రమం కోసం అనుమతి తీసుకుని రేవ్ పార్టీ నిర్వహించారని చెప్పారు. రోడ్డు ప్రమాదాల వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని... డ్రంకెన్ డ్రైవ్, అతి వేగం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని చెప్పారు.

More Telugu News