babu mohan: 'అంకుశం' తరువాత వరుసగా పది సినిమాలకి సైన్ చేశాను: నటుడు బాబూ మోహన్

  • నాటకాలు వేయడం సరదా 
  • 'ఆహుతి' మంచి పేరు తెచ్చిపెట్టింది
  • 'అంకుశం' తిరుగులేని కెరియర్ ను ఇచ్చింది  

తెలుగు తెరపై హాస్యాన్ని పరుగులు తీయించిన నటుల్లో బాబూ మోహన్ ఒకరుగా కనిపిస్తాడు. కోట శ్రీనివాసరావు .. బ్రహ్మానందం వంటి వారితో కలిసి తెరపై ఆయన చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అలాంటి బాబూ మోహన్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

"మొదటి నుంచి కూడా సరదాగా నేను నాటకాలు వేస్తూ ఉండేవాడిని. అలా నాటకాల ద్వారా వచ్చిన గుర్తింపుతోనే 'ఆహుతి' సినిమాలో అవకాశం వచ్చింది. నా నటన గురించి తెలిసి రాజశేఖర్ చెప్పడం వలన, కోడి రామకృష్ణగారు అవకాశం ఇచ్చారు. ఈ సినిమా 100 రోజులు ఆడటంతో, నటుడిగా నాకు మరింత గుర్తింపు వచ్చింది. ఆ తరువాత 'అంకుశం'లో నాకు మంచి పాత్ర పడింది. ఆ పాత్రతో ఇక నేను వెనుతిరిగి చూసుకోలేదు. ఆ సినిమా విడుదలైన తరువాత నేను వరుసగా 10 సినిమాలకి సైన్ చేశాను. నాకు ఆ సినిమా అంతటి క్రేజ్ ను తీసుకొచ్చింది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News