Krishna District: టెన్త్ పాస్ అయ్యానన్న ఆనందంలో కూల్ డ్రింక్ కోసం రోడ్డుపైకి వస్తే..!

  • పశ్చిమ గోదావరి జిల్లా కలవచర్లలో విషాదం
  • అక్కా చెల్లెళ్లను ఢీకొన్న టాటా ఏస్
  • అక్క మృతి, చెల్లికి గాయాలు

పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణురాలినయ్యానన్న ఆనందంలో ఓ బాలిక కూల్ డ్రింక్ కొనుగోలు చేసేందుకు రోడ్డుపైకి రాగా, వాహనం ఢీకొని ప్రాణాలు వదిలింది. ఈ ఘోర దుర్ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు సమీపంలోని కలవచర్ల గ్రామంలో జరిగింది. టెన్త్ రిజల్ట్స్ రాగానే, ఆనందంతో తన చెల్లెలితో కలిసి తిరుగుపల్లి రుక్మిణి (15) బయటకు వెళ్లగా, వేగంగా వచ్చిన టాటా ఏస్ - మ్యాజిక్ ఢీకొంది. ఈ ఘటనలో రుక్మిణి అక్కడికక్కడే ప్రాణాలు వదలగా, ఆమె చెల్లికి గాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. రుక్మిణి సోదరిని చికిత్స నిమిత్తం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  

More Telugu News