Kutumbarao: మోదీ కూడా 'మహర్షి' సినిమాలోని విలన్‌లా బాధపడుతున్నారట: కుటుంబరావు

  • సమావేశంలో మహర్షి సినిమా ప్రస్తావన
  • ఏపీ జోలికి ఎందుకు వెళ్లానా? అని మోదీ బాధపడుతున్నారట
  • సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందన్న కుటుంబరావు

టీడీపీ అధికార ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో  మహేశ్ బాబు నటించిన మహర్షి సినిమాకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఈ సినిమా ప్రస్తావనను తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ పరిస్థితి ఆ సినిమాలోని విలన్‌లా తయారైందని అన్నారు.

సినిమాలోని విలన్ పాత్రధారి అయిన జగపతిబాబు చివర్లో ఆ ఒక్క ఊరి జోలికి వెళ్లకుంటే బాగుండేదని అనుకుంటాడని, ఇప్పుడు మోదీ కూడా ఏపీ జోలికి వెళ్లకుండా ఉంటే బాగుండేదని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు.

కాగా, ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 27 నుంచి మూడు రోజులపాటు నిర్వహించాల్సిన మహానాడును వాయిదా వేశారు. అలాగే, లోక్‌‌సభ నియోజకవర్గాల వారీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహిస్తున్న సమీక్షలను నిలిపివేయాలని నిర్ణయించారు.

More Telugu News