Mahesh Babu: 'మహర్షి'కి మరికొన్ని సీన్స్ జోడిస్తారట

  • ఈ నెల 9న విడుదలైన సినిమా 
  • అన్ని ప్రాంతాల్లోను భారీ వసూళ్లు
  •  రెండవ వారంలో కొత్త సీన్స్ జోడింపు 

మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన 'మహర్షి' సినిమా, ఈ నెల 9వ తేదీ నుంచి థియేటర్స్ లో సందడి చేస్తోంది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి మరి కొన్ని సీన్స్ ను జోడించే ఆలోచనలో టీమ్ వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో మహేశ్ బాబుకి నచ్చిన సీన్స్ కొన్ని వున్నాయట. అయితే నిడివి ఎక్కువగా ఉందని ఆ సీన్స్ ను ట్రిమ్ చేశారట. ఇప్పుడు ఆ సీన్స్ ను పూర్తిగా వుంచుతారని తెలుస్తోంది. అంతేకాదు, కామెడీకి సంబంధించిన ఒకటి .. రెండు సీన్స్ కూడా జోడించనున్నారు. ఈ కారణంగా 10 నిమిషాల నిడివి పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. రెండవ వారంలో కొత్త సీన్స్ జోడింపు ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ ప్రయత్నం ఎలాంటి టాక్ తెస్తుందో చూడాలి.

More Telugu News