Andhra Pradesh: సీఎం చంద్రబాబును కలిసిన డీఎంకే నేత దురై మురుగన్

  • అమరావతిలో చంద్రబాబుతో మురుగన్ భేటీ
  • తాజా రాజకీయ పరిణామాలపై చర్చ
  • స్టాలిన్-కేసీఆర్ భేటీ వివరాలు బాబు దృష్టికి  

అమరావతిలో సీఎం చంద్రబాబుతో డీఎంకే నేత దురై మురుగన్ భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. నిన్న డీఎంకే అధినేతను తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దురై మురుగన్ ఏపీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. స్టాలిన్-కేసీఆర్ భేటీ వివరాలను చంద్రబాబు దృష్టికి ఆయన తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

More Telugu News