YSRCP: సర్వేలపై నిగ్గు తేల్చేందుకు మేము సిద్ధం, మీరు సిద్ధమేనా?: చంద్రబాబుకు వైసీపీ నేత సజ్జల సవాల్

  • భారీ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం
  • టీడీపీది గతం.. వైసీపీది భవిష్యత్
  • జగన్ సీఎం కాబోతున్నారన్న విషయం వాస్తవం

అన్ని జాతీయ ఛానెళ్లు జగన్ గెలుస్తారనే చెబుతున్నాయని, భారీ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నేత  సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కథ ముగిసిందని, టీడీపీది గతం, వైసీపీది భవిష్యత్ అని అర్థమవుతోందని, జగన్ సీఎం కాబోతున్నారన్న విషయం వాస్తవం అని వ్యాఖ్యానించారు.
 
చంద్రబాబు రోజుకో ప్రకటనతో భ్రమ కల్పిస్తున్నారని, ఈ నెల 23 తర్వాత ఉత్కంఠకు తెరపడుతుందని అన్నారు. సర్వేలు తమకే అనుకూలమని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని, తాను చేసింది తప్పని ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత ఆయన ఒప్పుకోవాల్సి వస్తుందని అన్నారు. ఈ సర్వేలపై నిగ్గు తేల్చేందుకు ఈ నెల 19న మేము సిద్ధం, మీరు సిద్ధమా? అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఎన్నికల సంఘాన్ని, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని దూషించడం ద్వారా చంద్రబాబు సాధించింది ఏమిటి? అని ప్రశ్నించారు. 

More Telugu News