Maharshi: నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మహర్షి’.. ఆనందంలో చిత్రబృందం

  • మహేశ్, పూజ జంటగా ‘మహర్షి’
  • అల్లరి నరేష్‌కు మంచి టర్నింగ్ పాయింట్
  • ఆకట్టుకుంటున్న రైతుకు సంబంధించిన సన్నివేశాలు

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మహర్షి’. ఈ నెల 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాలో మూడు గెటప్‌ల్లోనూ మహేశ్ అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాడు.

ముఖ్యంగా రైతులకు సంబంధించిన సన్నివేశాలు యూత్‌ని సైతం బాగా ఆకట్టుకున్నాయి. సినిమా చూసిన వారంతా వీకెండ్ వ్యవసాయం చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఒకరకంగా ఇది సినిమా పబ్లిసిటీకి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన అల్లరి నరేష్‌కు మంచి టర్నింగ్ పాయింట్. అతి తక్కువ సమయంలో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడంతో ‘మహర్షి’ చిత్రబృందం ఆనందంలో మునిగి తేలుతోంది.

More Telugu News