Andhra Pradesh: ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహణపై వీడని సస్పెన్స్!

  • సీఈసీ నుంచి ఇంకా లభించని అనుమతి
  • సీఈసీతో ఫోన్లో మాట్లాడిన ఇంఛార్జీ సీఈఓ సుజాత శర్మ
  • కాసేపట్లో సమాచారం వస్తుందన్న అధికారిణి

ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహణపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. రేపు ఉదయం కేబినెట్ సమావేశం నిర్వహించాలని అనుకున్నారు. కానీ, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంకా ఎటువంటి అనుమతి ఏపీ ప్రభుత్వానికి లభించలేదు. ఈ నేపథ్యంలో సీఈసీ అధికారులతో ఇంఛార్జీ సీఈఓ సుజాత శర్మ ఫోన్ లో మాట్లాడారు. సీఈసీ అధికారుల సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని, కాసేపట్లో ఈసీ నుంచి తమకు సమాచారం వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News