ram: 'ఇస్మార్ట్ శంకర్' టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు

  • షూటింగు దశలో 'ఇస్మార్ట్ శంకర్'
  • ఈ నెల 15వ తేదీన టీజర్ విడుదల
  •  రామ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే   

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' రూపొందుతోంది. రామ్ సరసన కథానాయికలుగా నిధి అగర్వాల్ - నభా నటేశ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. పాటల చిత్రీకరణకిగాను త్వరలో ఈ సినిమా టీమ్ విదేశాలకి వెళ్లనుంది.

 మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తోన్న ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఫస్టు టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెరిగేలా పూరి శ్రమిస్తున్నట్టు చెబుతున్నారు. ఇటు హీరో హీరోయిన్లు .. అటు దర్శకనిర్మాతగా పూరి ఈ సినిమా సక్సెస్ పైనే ఆశలు పెట్టుకున్నారు.

More Telugu News