nagarjuna: దసరానే ఖాయం చేసుకున్న 'మన్మథుడు 2'

  • రాహుల్ రవీంద్రన్ నుంచి 'మన్మథుడు 2'
  • కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ 
  • ముఖ్యమైన పాత్రల్లో సమంత .. అక్షర గౌడ

నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' రూపొందుతోంది. నాగార్జున సొంత బ్యానర్లో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ఆయన సరసన రకుల్ నటిస్తోంది. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగు 'పోర్చుగల్' లో జరుగుతోంది. నిన్నటితో అక్కడి షెడ్యూల్ పూర్తయింది. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు.

తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ సినిమాలో సమంత .. కన్నడ బ్యూటీ అక్షర గౌడ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను, దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. రొమాంటిక్ హీరోగా నాగార్జునను మరోసారి పరిచయం చేయనున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే వున్నాయి. 

More Telugu News