Mallikarjun Kharge: అదే జరిగితే ఢిల్లీలోని విజయ్ చౌక్‌లో మోదీ ఉరేసుకుంటారా?: ఖర్గే సవాలు

  • మోదీ సొంత డబ్బా కొట్టుకుంటున్నారు
  • ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్‌కు 40 సీట్లకు మించి రావంటున్నారు
  • ప్రధాని అయ్యే అవకాశం వచ్చిన సోనియా త్యాగం చేశారు

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. మోదీ తన ఎన్నికల ప్రచారంలో సొంతడబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మోదీ తొలుత ఆయన పార్టీ బీజేపీ గురించి మాట్లాడాలని, ఆ తర్వాతే తన గురించి మాట్లాడాలని, కాని అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు. ‘వన్స్‌మోర్ మోదీ’ అంటున్నారని విమర్శించారు. మోదీ ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్‌కు 40 సీట్లకు మించి రావని అంటున్నారని, అంతకుమించి సీట్లు వస్తే ఢిల్లీలోని విజయ్‌ చౌక్‌లోఉరేసుకుంటారా? అని ప్రశ్నించారు.

2004-2014 మధ్య యూపీఏ పాలన గురించి ఖర్గే మాట్లాడుతూ.. తమ హయాంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీకి ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా ఆమె త్యాగం చేశారని, దేశానికి ఓ ఆర్థికవేత్త ప్రధాని కావాలని అనుకున్నారని ఖర్గే పేర్కొన్నారు.

More Telugu News