Mahbubnagar District: సామాజిక మాధ్యమాల్లో డోకూరు ఎంపీటీసీ స్థానం బ్యాలెట్‌ పత్రాలు

  • రెండో విడత పోలింగ్‌ జరిగిన కేంద్రం ఇది
  • మొబైల్‌లో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌
  • నిందితులను గుర్తిస్తామన్న ఎంపీడీఓ

తెలంగాణలో జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బ్యాలెట్‌ పత్రాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు ఎంపీటీసీ స్థానం కోసం ముద్రించిన బాలెట్లుగా వీటిని గుర్తించారు. శుక్రవారం ఈ మండలంలో పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. పింక్‌, తెలుపు రంగు బ్యాలెట్లను ఫొటో తీసి సామాజిక మాధ్యమంలో ఉంచడంతో ప్రస్తుతం ఇవి వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కెర్లు కొడుతున్నాయి. ఈ విషయాన్ని ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి వద్ద ప్రస్తావించగా ఈ అంశం ఇంకా తన దృష్టికి రాలేదని చెప్పారు. బ్యాలెట్‌ పత్రాల క్రమ సంఖ్య ఆధారంగా నిందితులను గుర్తించి తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేశారు.

More Telugu News