ipl: హైదరాబాదులో ఐపీఎల్ ఫైనల్.. భారీ బందోబస్తు

  • రేపు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్స్
  • 2,800 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత
  • స్టేడియం లోపల కమాండ్ కంట్రోల్ యూనిట్ ఏర్పాటు

రేపు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. స్టేడియం లోపలి పరిసరాల్లో 300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అంతేకాదు, స్టేడియం లోపల ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 2,800 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. స్టేడియంతో పాటు, పిచ్ ను కూడా ఇప్పటికే తనిఖీ చేశామని తెలిపారు. సిగరెట్లు, ల్యాప్ టాప్, మద్యం, హెల్మెట్, పవర్ బ్యాంక్, తిను బండారాలు, బయట నుంచి మంచి నీటి బాటిల్స్ ను తీసుకురావద్దని ప్రేక్షకులకు సూచించారు.

More Telugu News