Andhra Pradesh]: పశ్చిమగోదావరి జిల్లాలో రికార్డింగ్ డ్యాన్సులు.. హాజరైన వైసీపీ నేతలు!

  • జిల్లాలోని మార్టేరులో ఘటన
  • ఓ వ్యాపారి పుట్టినరోజు వేళ అశ్లీల నృత్యాలు
  • ఐదుగురు యువతులు, నిర్వాహకులు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో అశ్లీల నృత్యాల కలకలం చెలరేగింది. పోడూరు మండలం కవిటం గ్రామానికి చెందిన ఓ వ్యాపారవేత్త నిన్నరాత్రి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలను పెనుమంట్ర మండలంలోని మార్టేరులో ఉన్న కోణాల మాణిక్యం కల్యాణ మండపంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఐదుగురు యువతులను తీసుకొచ్చి రికార్డింగ్ డ్యాన్సులు చేయించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. రికార్డింగ్ డ్యాన్సులు చేస్తున్న ఐదుగురు యువతులతో పాటు ఇద్దరు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.

కాగా, ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలు హాజరయినట్లు సమాచారం. అయితే సదరు నేతలపై పోలీసులు కేసు నమోదుచేశారా? లేదా? అన్నది ఇంకా తెలియరాలేదు.

More Telugu News