Amala: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మణిరత్నం సినిమాలో అమలా పాల్ 
  • సరిహద్దుల్లోకి వెళుతున్న 'వెంకీమామ' 
  • మరోసారి 'అర్జున్ రెడ్డి' జంట

*  డస్కీ బ్యూటీ అమలా పాల్ కి లక్కీ చాన్స్ తగిలినట్టు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న 'పొన్నియన్ సెల్వం' పిరీడ్ మూవీలో ఓ కీలక పాత్రకు అమలా పాల్ ను ఎంచుకున్నట్టు సమాచారం.
*  వెంకటేశ్, నాగ చైతన్య కలసి నటిస్తున్న 'వెంకీ మామ' చిత్రం తాజా షెడ్యూలు షూటింగును కశ్మీర్ సరిహద్దుల్లో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన లోకేషన్లను ఎంపిక చేసే పనిలో దర్శకుడు బాబీ వున్నాడు.  
*  'అర్జున్ రెడ్డి' జంట విజయ్ దేవరకొండ, శాలినీ పాండే కలసి మరోసారి నటించనున్నారు. ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే త్రిభాషా చిత్రంలో ఈ జంట కనువిందు చేయనుంది. విజయ్ బైక్ రేసర్ గా కనిపించే ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా మాళవిక మోహనన్ నటిస్తుంది.

More Telugu News