trump: అన్నంతపనీ చేసిన ట్రంప్.. తగిన మూల్యం చెల్లించుకుంటారంటూ చైనా వార్నింగ్

  • చైనా దిగుమతులపై 200 బిలియన్ డాలర్ల మేర సుంకాల పెంపు
  • పలు వస్తువులపై 10 నుంచి 25 శాతం వరకు పెంపు
  • అదే స్థాయిలో స్పందిస్తామన్న చైనా

చైనా దిగుమతులపై సుంకాన్ని పెంచుతామని చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... అన్నంత పనీ చేసేశారు. 200 బిలియన్ డాలర్ల మేర చైనా దిగుమతులపై సుంకాలను పెంచారు. పలు వస్తువులపై 10 నుంచి 25 శాతం వరకు సుంకాలను పెంచేశారు. ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం పట్ల చైనా అదే స్థాయిలో స్పందించింది. ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి సుంకాల పెంపు సరైన చర్య కాదని తెలిపింది. అమెరికా తీరు చైనాకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని చెప్పింది. తన నిర్ణయాన్ని అమెరికా పున:సమీక్షించుకోవాలని... లేని పక్షంలో తాము కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తామని తెలిపింది.

ఈ సందర్భంగా చైనా ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. ప్రపంచ వృద్ధి రేటు కుదుపుకు గురవుతుందని తెలిపారు.

More Telugu News