Guntur District: అధికారం జగన్‌కు కలగానే మిగులుతుంది: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోస్యం

  • ప్రజల తీర్పు ఏమిటో ఈనెల 23న వైసీపీకి తెలుస్తుంది
  • కంగుతినడం ఖాయం 
  • ప్రజలు బుద్ధి చెబుతారన్న మంత్రి 

అధికారం చేతికి వచ్చినట్లు పగటి కలలు కంటున్న వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 23న ప్రజలిచ్చే తీర్పుతో కంగుతినడం ఖాయమని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోస్యం చెప్పారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అధికారం జగన్‌కు పగటి కలగానే మిగిలిపోనుందన్నారు. వైసీపీ దురాలోచనకు ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెపుతారన్నారు.

More Telugu News