Supreme Court: రేపటి నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు

  • అత్యవసర వ్యాజ్యాల విచారణకు ప్రత్యేక ధర్మాసనాలు
  • ఆయా ధర్మాసనాల వివరాలు వెల్లడి
  • మే 13 నుంచి మే 20 వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం

రేపటి నుంచి సుప్రీం కోర్టుకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర వ్యాజ్యాల విచారణ నిమిత్తం ప్రత్యేక ధర్మాసనాలను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఆయా ధర్మాసనాల వివరాలు

- మే 13 నుంచి మే 20 వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం

- మే 21 నుంచి మే 24 వరకు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం

- మే 25 నుంచి మే 30 వరకు సీజేఐ గొగోయ్, జస్టిస్ ఎం.ఆర్ షా ధర్మాసనం

- మే 31 నుంచి జూన్ 2 వరకు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎం.ఆర్ షా ధర్మాసనం

- జూన్ 3 నుంచి జూన్ 5 వరకు జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం

- జూన్ 6 నుంచి జూన్ 31 వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ రస్తోగి ధర్మాసనం  

- జూన్ 14 నుంచి జూన్ 30 వరకు ఏర్పాటు చేసిన ధర్మాసనాల వివరాలు తదుపరి వెల్లడి కానున్నాయి.

More Telugu News