kurnool: బాలింత ప్రాణాల మీదికి తెచ్చిన కుళాయి వద్ద గొడవ

  • ఘర్షణలో కుప్పకూలిన రెండు నెలల బాలింత
  • ఆసుపత్రికి తరలించేలోగానే మృతి
  • కర్నూల్ నగరం లక్ష్మీనగర్‌లో ఘటన

నీటిని పట్టుకునే సమయంలో కుళాయి వద్ద ఏర్పడిన వివాదం చివరికి ఘర్షణకు దారితీసి బాలింత ప్రాణాల మీదికి తెచ్చింది. కర్నూల్ నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. కర్నూల్ లక్ష్మీనగర్‌లో షేక్షావలి, షేకున్‌బీ దంపతులు. వీరి కుమార్తె మౌలాబి. ఐదేళ్ల క్రితం పెళ్లయిన మౌలాబి గర్భం దాల్చడంతో కొన్నాళ్ల క్రితం పుట్టింటికి వచ్చింది. రెండు నెలల క్రితం ఈమె బిడ్డకు జన్మనిచ్చింది. ఇదే ప్రాంతంలో రామచంద్రమ్మ, లక్ష్మయ్య దంపతులు కూడా నివాసం ఉంటున్నారు.

గురువారం కుళాయి వద్ద నీరు పట్టుకునే సమయంలో రామచంద్రమ్మ, లక్ష్మయ్య, మౌలాబీల మధ్య గొడవ జరిగింది.  ఆ సమయానికి షేకున్‌బీ పనిలోకి వెళ్లింది. సాయంత్రం తిరిగి వచ్చాక మౌలాబీ తల్లికి జరిగింది తెలిపింది. దీంతో రెండు కుటుంబాల మధ్య మళ్లీ గొడవ మొదలయ్యింది. రామచంద్రమ్మ కుటుంబీకులు దాడి చేయడంతో షేకున్‌బీ, ఆమె కుమార్తె మౌలాబీ కుప్పకూలిపోయారు. బాలింత అయిన మౌలాబీ స్పృహ కోల్పోవడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె మృతి చెందింది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.

More Telugu News