Guntur District: గుంటూరు జిల్లాలో 84 మంది ఎస్సైల బదిలీ.. అందరిపైనా అవినీతి ఆరోపణలు

  • ఒకే పోలీస్ స్టేషన్‌లో సంవత్సరాల తరబడి పాతుకుపోయిన ఎస్సైలు
  • బదిలీలకు గత కొంతకాలంగా కసరత్తు
  • ఓట్ల లెక్కింపునకు ముందు నిర్ణయం

గుంటూరు జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 84 మంది ఎస్సైలను ఎస్పీ రాజశేఖర్ బాబు బదిలీ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన ఎస్సైలందరూ ఒకే పోలీస్ స్టేషన్‌లో సంవత్సరాల తరబడి పనిచేస్తుండడం గమనార్హం. అంతేకాదు, అందరిపైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీరి బదిలీకి గత కొంతకాలంగా కసరత్తు జరుగుతోంది. పాలనలో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఓట్ల లెక్కింపునకు కొన్ని రోజుల ముందు ఇంత పెద్ద ఎత్తున ఎస్సైల బదిలీలు జరగడం చర్చనీయాంశమైంది.

More Telugu News