Andhra Pradesh: ఏపీ కేబినెట్ అజెండాపై స్క్రీనింగ్ కమిటీతో సీఎస్ భేటీ

  • ఈ భేటీకి హాజరైన పలు శాఖల కార్యదర్శులు
  • అజెండా అంశాలపై చర్చ
  • అనంతరం సీఈసీ అనుమతి కోరనున్నారు

ఏపీ కేబినెట్ అజెండాపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. అజెండా అంశాలపై చర్చించిన అనంతరం, దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి నిమిత్తం సీఎస్ పంపనున్నారు. ఈ భేటీకి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వరప్రసాద్, పశు సంవర్థక శాఖ కార్యదర్శి శ్రీధర్, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల్ వలెవన్ హాజరయ్యారు. 

More Telugu News