anchor: ఇలాంటి ఫొటోలా పోస్ట్ చేసేది?.. యాంకర్ అనసూయపై నెటిజన్ల విమర్శ!

  • భర్త శశాంక్ భరద్వాజ్ కు అనసూయ మసాజ్  
  • మసాజ్ చేస్తుండగా ఫొటో తీసిన కొడుకు అయాన్ష్
  • ఈ ఫొటో పోస్ట్ చేసిన అనసూయపై విమర్శలు 

సోషల్ మీడియాలో తన పోస్ట్ లు చేస్తూ చురుగ్గా ఉండే సెలెబ్రిటీలలో ప్రముఖ యాంకర్ అనసూయ కూడా ఒకరు. అయితే, ఆమె తాజాగా పోస్ట్ చేసిన ఓ ఫొటో కారణంగా ఆమెపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తన భర్త శశాంక్ భరద్వాజ్ కు అనసూయ మసాజ్ చేస్తున్న సందర్భంలో వారి కొడుకు అయాన్ష్ ఓ ఫొటో తీశాడు. ఈ ఫొటోను అనసూయ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది.

 ఇక, ఈ ఫొటోను చూసిన నెటిజన్లు మండిపడటమే కాదు విమర్శలు కూడా చేశారు. ఎందుకంటే, భర్తకు మసాజ్ చేస్తున్న అనసూయ కేవలం షర్ట్ మాత్రమే ధరించి ఉన్నట్టు ఆ ఫొటోలో కనపడుతుంది. దీనిపై, నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేసే ముందు ఆలోచించండి అంటూ ఆమెకు హితవు పలికారు.  

More Telugu News