sensex: కొనసాగుతున్న మార్కెట్ల పతనం.. కుప్పకూలిన సెన్సెక్స్

  • వెంటాడుతున్న అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు
  • ఎన్నికల ఫలితాల నేపథ్యంలో లాభాల స్వీకరణకు  మొగ్గు చూపుతున్న మదుపర్లు 
  • 488 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతూనే ఉంది. వరుసగా ఆరో రోజు మార్కెట్లు పతనమయ్యాయి. అమెరికా-చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధంతో పాటు పలు కార్పొరేట్ కంపెనీల ఫలితాలు అంచనాలను అందుకోకపోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీనికి తోడు, సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటంతో... మదుపరులు ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు.

 ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 488 పాయింట్లు పతనమై 37,789కి పడిపోయింది. నిఫ్టీ 138 పాయింట్లు కోల్పోయి 11,359 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
30 స్టాకుల సెన్సెక్స్ లో కేవలం రెండు కంపెనీల షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. వీటిలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.29%), టీసీఎస్ (0.11%) ఉన్నాయి.

టాప్ లూజర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (-3.35%), బజాజ్ ఫైనాన్స్ (-3.22%), టాటా మోటార్స్ (-2.80%), బజాజ్ ఆటో (-2.55%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.53%).

More Telugu News