maharshi: కళ్లు చెదిరే స్థాయిలో 'మహర్షి' ప్రీరిలీజ్ బిజినెస్!

  • ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదలవుతున్న 'మహర్షి'
  • రూ. 150 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ 
  • కర్ణాటకలో 400 స్క్రీన్లపై విడుదలవుతున్నట్టు సమాచారం

మహేశ్ బాబు హీరోగా నటించిన 'మహర్షి' చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఇక కర్ణాటకలో అయితే రికార్డు స్థాయిలో సుమారు 400 స్క్రీన్లపై రిలీజ్ అవుతున్నట్టు చెబుతున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం కళ్లు చెదిరే రీతిలో రూ. 150 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఒక్క తెలుగు హక్కులే రూ. 100 కోట్లను సంపాదించి పెట్టాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటించగా, అల్లరి నరేష్ కీలక పాత్రను పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించగా... వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. రూ. 100 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

More Telugu News