Andhra Pradesh: ఏపీలో ప్రత్యేక డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితి పెంచుతూ నిర్ణయం

  • ప్రత్యేక డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితి  54కు పెంపు
  • దరఖాస్తుల సమర్పణకు గడువు సైతం పెంపు
  • పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఉత్తర్వులు  

ఏపీలో ప్రత్యేక డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితి పెరిగింది. వయోపరిమితిని 54 ఏళ్లకు పెంచుతున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక డీఎస్సీ దరఖాస్తు గడువు సైతం పెంచుతున్నట్టు పేర్కొంది. ఈ నెల 15వ తేదీ వరకు పేమెంట్ గేట్ వే ద్వారా ఫీజు చెల్లించవచ్చని, ఈ నెల 16వ తేదీ రాత్రి 12 గంటల వరకు దరఖాస్తులు సమర్పించ వచ్చని తెలిపింది.

More Telugu News