Andhra Pradesh: ఏపీ సచివాలయంలో నిలిచిపోయిన జీ-మెయిల్ సేవలు!

  • ప్రభుత్వ వ్యవహారాలన్నీ జీ-మెయిల్ ద్వారానే  
  • అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ పని చేయని జీ-మెయిల్  
  • నిలిచిపోయిన సమాచార మార్పిడి

ఏపీ తాత్కాలిక సచివాలయంలో జీ-మెయిల్ సేవలు నిలిచిపోయాయి. దీంతో, ప్రభుత్వ సేవలకు అంతరాయం కలిగింది. అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ జీ-మెయిల్ పనిచేయకపోవడంతో సమాచార మార్పిడి నిలిచిపోయింది. సచివాలయం నెట్ వర్క్ ఐపీలో బ్లాక్ చేయడం వల్లే జీ-మెయిల్ సేవలు ఆగిపోయాయని ఉద్యోగులు చెబుతున్నారు. కాగా, ప్రభుత్వ వ్యవహారాలన్నీ జీ-మెయిల్ ద్వారానే నిర్వహిస్తున్నారు. జీ-మెయిల్ సేవలు నిలిచిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది.

More Telugu News