Andhra Pradesh: మనవడితో ఆటలాడితే ఆ కిక్కే వేరప్పా.. ఫొటోలు పోస్ట్ చేసిన గంటా శ్రీనివాసరావు!

  • టూర్ లో ఎంజాయ్ చేస్తున్న ఏపీ మంత్రి
  • మనవడితో కలిసి సైక్లింగ్
  • ట్విట్టర్ స్పందించిన టీడీపీ నేత

టీడీపీ నేత, ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం విహారయాత్రలో ఉన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి టూర్ కు వెళ్లిన గంటా శ్రీనివాసరావు మనవడితో ఆడుకుంటూ హాయిగా గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనవడితో ఆడుకుంటున్న ఫొటోలను గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.


ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గంటా విశాఖ ఉత్తరం నియోజవకర్గం నుంచి పోటీ చేశారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ లోపునే గంటా ఏపీకి తిరిగివచ్చే అవకాశముందని భావిస్తున్నారు. కాగా, తాము విహారయాత్ర కోసం ఎక్కడకు వెళ్లామన్న విషయమై గంటా శ్రీనివాసరావు స్పష్టత ఇవ్వలేదు.

More Telugu News