Andhra Pradesh: టీడీపీ నగదు వరద పారిస్తోంది.. చర్యలు తీసుకోండి.. ఈసీకి నెల్లూరు వైసీపీ నేతల ఫిర్యాదు!

  • పల్లెపాలెం, అటకానితిప్పలో రీపోలింగ్
  • టీడీపీ ప్రలోభాలకు గురిచేస్తోందన్నవైసీపీ
  • ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటామన్న ఈసీ

ఆంధ్రప్రదేశ్ లో సాంకేతిక కారణాలతో దాదాపు ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు పూర్తిచేసింది. అయితే టీడీపీ నేతలు ఈ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు.

నెల్లూరు జిల్లాలోని పల్లెపాలెం, అటకానితిప్పలో ఓటర్లకు మద్యం, డబ్బులు యథేచ్ఛగా పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. వీరందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. కాగా, ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా అధికారులు వైసీపీ నేతలకు హామీ ఇచ్చారు.

More Telugu News